యాడికి గ్రామంలోజాప్ కమిటీ సమావేశం ..

న్యూస్.9 –;

జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ JAAP రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా నందు వివిధ కార్యక్రమాలు రాష్ట్ర ఉపాధ్యక్షులు రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ముందు పోతున్న తరుణంలో నేడు చేపడుతూJAAP బలపరచడానికి పలు నియోజకవర్గాల నుండి జర్నలిస్టు సమస్యలపై ముందుండి పోరాడుతున్నటువంటి వారికి ఆహ్వానం పలుకుతు తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం లో జర్నలిస్టులతో కలవడం జరిగింది. జాప్ పోరాటాలను, వివరించి సభ్యత్వం తీసుకోవాలని కోరారు.

 

ముఖ్యంగా జోగిరెడ్డి మాట కోసం పత్రిక ఎడిటర్ పలు కార్యక్రమాల్లోనూ ముందుండి జిల్లా నాయకులతో సత్సంబంధాలు నిలుపుకుంటూ కార్యక్రమాలు చేపడుతున్నారని ఇందుకుగాను

జోగి రెడ్డి గారిని అనంతపురం జిల్లా కమిటీలో ఉపాధ్యక్షులుగా తీసుకోవడం జరిగింది

 

ఇకపై జరిగినటువంటిJAAP పలు కార్యక్రమాలు విధి విధానాల పట్ల సంసిద్ధుడై జర్నలిస్టు సమస్యలపై పోరాడుటకు ముందుంటానని హామీ తో జోగిరెడ్డికి జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్ చేతుల మీదుగా నియమిత పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జీవన్ కుమార్, యాడికి మండల విలేకరుల సంఘం అధ్యక్షులు ఫరూక్, ఉపాధ్యక్షులు జోగిరెడ్డి, సీనియర్ పాత్రికేయులు సారెడ్డి రామచంద్రారెడ్డి, మండల విలేకరులు షబ్బీర్, రంగస్వామి, రహంతుల్లా చంద్రశేఖరరెడ్డి, బాలకృష్ణ, శర్మాష్ వలి, లక్ష్మీనారాయణ, సుధాకర్, నారాయణస్వామి లు పాల్గొన్నారు.