బడుగు బాలహిన వర్గాల కోసం పోరాడిన నాయకులు బోగె రాజారాం.. ఎంపీ గడ్డం వంశీకృష్ణ..

పెద్దపల్లి జిల్లా

మంథని లో దళిత ఉద్యమకారుడు బోగే రాజారాం 3 వ వర్థంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సంస్కరణ సభలో పాల్గోని భోగె రాజారాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.

అనంతరం ఆయన మాట్లాడుతూ

దళిత వర్గాల కోసం ఎన్ని ఇబ్బందులనైన ఎదుర్కొని వారి అండగా నిలిచిన నాయకుడు భోగే రాజారాం అని కొనియాడారు .

ఈ ప్రాంతం నుండి బి ఎస్ పి పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారని రాజారాం ఈ ప్రాంతంలోని దళితులకు ఆయన సేవలు అందించారని దళితుల హక్కుల కోసం ఆయన పోరాడాలని

భోగి రాజారాం ఆశయ సాధనకు కొనసాగిద్దామని ఆయన పేర్కొన్నారు. దళితులకు ఏలాంటి ఇబ్బందులు ఉన్న వారి కోసం అండగా ఉంటానని బోగే రాజారాం కుటుంబానికి అండగా ఉంటానని పెద్ద పల్లి ఎంపీ గడ్డం వంశి అన్నారు,

ఈ కార్యక్రమానికి జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు నక్క రవి అధ్యక్షత వహించగా దళిత సంఘాల నాయకులు నూకల బానయ్య తగరం సీనియర్ న్యాయవాది రఘైతంరెడ్డి. శంకర్ లాల్ బూడిద రాజయ్య రామగిరి కుమార్ ఎడ్ల కిష్టయ్య అప్పల పోచయ్య . జంజర్ల శ్రీనివాస్ జానీ. నర్సాపూర్ రవీందర్ . మామిడిపల్లి బాపయ్య . బొంకూరి మధు .ఎరుకల సుమన్.న్యాయవాది ఆర్ల నాగరాజు. బండి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.