ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన సదస్సు.. ఐ సి టి సి కౌన్సిలర్ : సత్యానందం.. ల్యాబ్ టెక్నిషన్ : సుకుమార్..

పెద్దపల్లి, మంథని

(సెప్టెంబర్ 27)

 

పెద్దపల్లి జిల్లామంథని మండలం లోని కాకర్లపల్లి గ్రామంలో

ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వుండాలని ఐ సి టి సి కౌన్సిలర్ సత్యనందం, ల్యాబ్ టెక్నిషన్ సుకుమార్ అన్నారు. శుక్రవారం 27 సెప్టెంబర్ 2024 వ రోజున మంథని మండలం లోని కాకర్ల పల్లి గ్రామంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించి, వైద్య శిబిరం నిర్వహించి రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిర్దారణ పరీక్షలు చేశారు. నేటి సమాజంలో ఈ వ్యాధి వ్యాపించకుండా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుందన్నారు. ఈ వ్యాది గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నపుడే రాకుండా నిరోధించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఎయిడ్స్ వ్యాధికి మందు లేదని, నివారణ ఒక్కటే మార్గం అన్నారు. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం ద్వారా సుఖవ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఎయిడ్స్ అంటు వ్యాధి కాదని, వ్యాధి ఉన్నవల్లతో కలసి తిన్నా, పక్కన ఉన్న సోకదన్నారు. ఈ వ్యాధిపై అనుమానాలు ఉన్నవాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ 1097 కి కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈకార్యక్రమం లో ల్యాబ్ టెక్నషియన్ సుకుమార్, Anm లు, ఆశ వర్కర్స్, శ్వేత, రమ గద్దల పల్లి వైద్య సిబ్బంది, గ్రామస్థులు పాల్గోన్నారు.