యాడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు సెప్టెంబరు 17నుంచి అక్టోబర్ 2వరకు కార్యక్రమాలు జరిగాయి.

న్యూ 9 )యాడికి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు సెప్టెంబరు 17నుంచి అక్టోబర్ 2వరకు కార్యక్రమాలు జరిగాయి.రాష్ట్ర స్థాయిలో అనంతపురం జిల్లా కు మొదటి స్థానము వచ్చిన సందర్భంగా జిల్లా కేంద్రము లో వివిధ మండలము ల నుంచి మంచి ప్రతిభ కనబరిచిన అధికారుల కు సన్మానము చేశారు. అందులో భాగంగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రము లో యాడికి ఈవోఆర్డి వెంకటేశు, ఉపాధ్యాయుడు దూదేకుల రవీంద్ర కు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మరియు ఎంపీలు అంబిక లక్ష్మి నారాయణ, పార్థసారథి,ఎమ్మెల్యే పరిటాల సునీత జెడ్పీ సీఈఓ ఒబులమ్మ తదితరుల సమక్షంలో సన్మానం నిర్వహించి ప్రశంసా పత్రాన్ని అందజేశారని తెలియజేశారు.