మత్స్యకారులు అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర మత్స్యకార చైర్మన్: మెట్టు సాయి కుమార్..

న్యూస్ 9 tv రిపోర్టర్

చేరాల. రవీందర్

పెద్దపల్లి జిల్లా మంథని :
తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు.
సోమవారం మంథని పట్టణంలోని తమ్మచెరువులో ఉచిత చేప పిల్లలలను చెరువులో వదిలారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువుల్లో చేపపిల్లలను వేసి మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయం మేరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలు మేరకు వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో వెలుగులు నింపడమే తమ లక్ష్యమన్నారు.
చేప పిల్లల పంపిణీ వల్ల భవిష్యత్ లో మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవాలని ఆకాంక్షించారు. అన్ని జిల్లాల్లో తెలంగాణ మత్య్సశాఖ తరుపున చేపల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి చెరువుకు మూడు రకాల చేప పిల్లలు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమాదేవి, వైస్ చైర్మన్ శ్రీపతి బాలయ్య కౌన్సిలర్లు కాయితి సమయ్య, చొప్పకట్ల హనుమంతు, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, జిల్లా డైరెక్టర్ పోతరవేణ క్రాంతి, మంథని మత్స్య సహకార సంఘం కార్యదర్శి గుండా రాజు, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు అంకరి కుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్, మత్స్య కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.