మత్స్య శాఖ చైర్మన్ ను సన్మానించిన గంగపుత్రులు.. మంథని గంగపుత్ర సంఘం అధ్యక్షులు : అంకరి కుమార్..

న్యూస్ 9 tv రిపోర్టర్

మంథని, పెద్దపల్లి :

పెద్దపల్లి జిల్లా మంథనిలో సోమవారం రోజున గంగపుత్ర ముద్దుబిడ్డ తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ను మంథని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సోమవారం మంథని పట్టణంలోని తమ్మచెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగపుత్ర కుల బాంధవుడుని ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు అంకరి కుమార్, మాదరవేన లక్ష్మణ్, అంకరి శివ మురళి, అంబటి గట్టయ్య, అటికేటి నరేష్, అంకరి లింగయ్య, రానవేణ చరణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.