గౌడ కులస్తులకు కాటమయ్య రక్షక కవచం పంపిణి : ఐటి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు…

  • గౌడ కులస్తులకు కాటమయ్య రక్షక కవచం పంపిణి :
  • ఐటి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు..
  • పెద్దపల్లి ఏంపి : గడ్డం వంశీ కృష్ణ…
  • జిల్లా కలెక్టర్ : కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, మంథని :

( అక్టోబర్ 11)

 

మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన

అనంతరం ఏంపి వంశీ కృష్ణ, జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష తో కలసి ఐటి పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, గౌడ కులస్తులకు  కాటమయ్య రక్షక కవచ కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతి రక్షక కవచ కిట్ పై దాదాపు 9 వేల రూపాయలు ఖర్చు చేసి సబ్సిడీపై పూర్తి ఉచితంగా గౌడ సోదరులకు అందిస్తుందని, చెట్టు పై కల్లు తీసేందుకు వెళ్లినప్పుడు ఈ కిట్ ఉపయోగించడం వల్ల ప్రమాదాలను నియంత్రించవచ్చని, ప్రతి గౌడ సోదరుడు ఈ కిట్ ను వినియోగించాలని అన్నారు. చెట్టు పైకి ఎక్కి కళ్ళు తీసే గౌడ సోదరులను గుర్తించి కాటమయ్య రక్షక కిట్లను ముందుగా పంపిణీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రమ,ఆర్.& బి ఈ.ఈ.భావ్ సింగ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్, ఎక్సైజ్ సూపరంటెండెంట్ మహిపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు,గౌడకులస్తులు, తదితరులు పాల్గొన్నారు.