బాధిత కుటుంబాన్ని పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే : పుట్ట మధుకర్.. ఆఖరి మజిలీకి ముక్తి ఆశ్రమం.. పేదోడికి అండగా పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్….

న్యూస్ 9 tv రిపోర్టర్

చేరాల. రవీందర్

మంథని.

 

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం గోదావరి తీరం కు పోయే దారిలో బస్సు డిపో సమీపంలో నెలకొల్పిన ముక్తి ఆశ్రమం….

అద్దె ఇంట్లో ఉంటూ ఆఖరి మజిలీకి అష్టకష్టాలు పడే పేదోడికి ముక్తి ఆశ్రమం భరోసా ఇస్తోంది. అద్దె ఇంట్లో ఉంటున్న కుటుంబంలో ఎవరైనా చనిపోతే అంతిమ కార్యక్రమంలో ఆ అద్దె ఇంట్లో నిర్వహించేందుకు ఇంటి యజమానులు అడ్డుకోవటం సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. ఒకరు చనిపోతే గౌరవించాల్సిన పరిస్థితులు ఉన్నా కట్టుబాట్లు, ఆచారాల పేరుతో పేదోడిని ఇబ్బందులకు గురి చేసిన సందర్బాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎంతో మంది పేదలు తమ కుటుంబ సభ్యుడు చనిపోతే అద్దె ఇంట్లో ఉండలేక చివరకు పార్థివ దేహాన్ని రోడ్డుపైనే ఉంచిన సందర్బాలు అనేక ఉన్నాయి. పేదోడి ఆఖరి మజిలీకి కుటుంబసభ్యులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని బస్‌ డిపో సమీపంలో ముక్తి ఆశ్రమం నిర్మించారు. అద్దె ఇంట్లో ఉంటూ ఎవరైన చనిపోతే వారి అంతిమ సంస్కారాలతో పాటు కర్మకాండ పూర్తి చేసుకునే వరకు ఈ ముక్తి ఆశ్రమంలో ఉండి చేసుకునే విధంగా అన్ని సదుపాయాలు కల్పించారు. మంథని మండలం రచ్చపెల్లి గ్రామానికి చెందిన అబ్బెజు సముద్రామ్మ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో కిరాయి ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల సముద్రమ్మ మరణించగా అద్దె ఇంట్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇంటి యజమాని అంగీకరించలేదు. దీంతో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదించి…ముక్తి ఆశ్రమంలో వారి అంతిమ కార్యక్రమంలు నిర్వహించుకుంటున్న సందర్బంగా ఆదివారం రోజున ఆ కుటుంబసభ్యులను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శించారు. ముక్తి ఆశ్రమం మీలాంటి పేదోళ్ల కోసమే ఏర్పాటు చేశామని, పేదోడి ఆఖరి మజిలీలో ఎలాంటి ఇబ్బందులు రాకూడనే ఆలోచనతో ముక్తీ ఆశ్రమం నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో మంథని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కుమార్ తో పాటు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.