Headlines

ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నలుగురు అరెస్ట్

  • ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నలుగురు అరెస్ట్
  • చెడు వ్యాసనాలకు బానిసలై మోటార్ సైకిల్లు చోరీ
  • 14 మోటార్ బైక్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

కొత్తపేట…

చెడు వ్యసనాలకు బానిసలై మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు రావులపాలెం సీఐ రజనీ కుమార్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.మండలం పరిధిలోని కొత్తపేట బాబులు కాలనీ చెందిన నలుగురు యువకులు పవన్ కుమార్, తరుణ తేజ, శ్రీరామమూర్తి, అవినాష్ వ్యసనాలకు బానిసలయ్యారన్నారు. జల్సాలు చేయడం కోసం ఏడాది నుంచి బైక్ లను దొంగలిస్తున్నారని చెప్పారు. దీంతో ఆ నలుగురు యువకులను ఎస్సై వి. మణికుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కొత్తపేట గోగివారిపేట వద్ద మంగళవారం అరెస్టు చేశారని చెప్పారు. వారి వద్ద నుంచి 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.ఈ నలుగురు యువకులను కొత్తపేట కోర్టు లో హాజరు పరుస్తామని తెలిపారు.