Headlines

బడ్జెట్ అంకెల గారడీ తప్ప అభివృద్ధి ఊసే లేదు…* *ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయింపులు లేవు…* బండారు సత్యానందరావు రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు…

  • బడ్జెట్ అంకెల గారడీ తప్ప అభివృద్ధి ఊసే లేదు…
    ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయింపులు లేవు…
  • బండారు సత్యానందరావు
    రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశ కలిగిస్తుంది.. వైసిపి ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే వాగ్దానాలుకి నిధులను కేటాయించకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారు… పేదలకు గృహ నిర్మాణం చేస్తామన్నారు.. ఒక్క కొత్తపేట నియోజకవర్గంలోని 17వేల మందికి స్థలాలు పేరుతో పట్టా కాగితాలు ఇచ్చారు. బడ్జెట్లో గృహ నిర్మాణానికి నిధులు కేటాయించ కుండా ఇళ్ళు నిర్మాణం ఎలా చేస్తారు…
ఎస్సీ ల ప్రయోజనాలు కాపాడుతామని గొప్పగా చెప్పుకునే వైసిపి ప్రభుత్వం వారికి బడ్జెట్లో ఒరగబెట్టిందేమీ లేదు… ఉద్యోగులకు జీతాలపై భరోసా లేదు… వారి పెండింగ్ బకాయిలకు సంబంధించి ఊసే లేదు…
అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితిని రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది… అభివృద్ధికి నిధులే లేవు.. ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు..
రాజధాని అమరావతిపై దగాకోరు వైఖరిని ప్రభుత్వం అవలంబిస్తోంది.. కేవలం మెట్రో ప్రాజెక్టు పేరుతో మూడు కోట్లు నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు… కోనసీమలో కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది లేదు.. ఒక్క కోనసీమలో రైల్వే లైన్ కి 300 కోట్ల అవసరం కాగా, రాష్ట్రంలో మొత్తం రైల్వేలకు సంబంధించి రూ.150 కోట్లు కేటాయించడం ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తుంది… ప్రజలను అన్ని విధాల మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మరోసారి బడ్జెట్లో అంకెల గారడీ చూపింది… లో