వైకాపా ఎంపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ తెదేపా మాజీ ఎంపీ నిమ్మల

 

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప శుక్రవారం మండల కేంద్రంలో వెలసిన శ్రీ పాలపాటి దిన్నె అంజనేయ స్వామిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయి నీది కాదని ఎద్దేవా చేశారు పులివెందులలో వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగింది ఎవరు చేశారో చెప్పాలని ప్రశ్నించారు.వివేకానంద రెడ్డి హత్యలో ఎవరెవరి హస్తం ఉందో అనేది ప్రజలకు బాగా తెలుసు అని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండు కాళ్లు బయటపెట్టిన వెంటనే రాష్ట్రంలో వర్షాలు లేకుండా పోయాయని విమర్శించే స్థాయి నీది కాదని ఆగ్రహించారు.చంద్రబాబు నాయుడు రెండు పాదాలు బయటపెట్టిన తర్వాత ఏ ఏ ప్రాంతాలలో వర్షాలు పడ్డాయో గమనించుకోవాలన్నారు.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాలు అధిక వర్షాలతో రాష్ట్ర మొత్తం పల్లకల్లోలమై రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్రస్థాయిలో నష్టపోయిన సంఘటనలను వైకాపా నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు పై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడపడమే తప్ప ఆ సమయంలో రైతుల గురించి ఆలోచించిన దాఖలాలు మీకు లేవని వాపోయారు.కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ రాజశేఖర్ బాబు, గుత్తా ప్రసాద్, బేకరీ నాగరాజు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.