యాడికి మండల కేంద్రంలోనిపోలీస్ చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంపోందించుకోవాలి  -స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో యాడికి సిఐ నాగార్జున రెడ్డి..

న్యూస్.9)

యాడికి: పోలీసు చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని యాడికి సిఐ నాగార్జున రెడ్డి తెలిపారు. బుధవారం యాడికి లోని స్టార్ పారడైజ్ హైస్కూల్ లో చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. దిశ చట్టం, పొక్సో చట్టం లపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల నియంత్రణపై విద్యార్థులకు వివరించారు.డయల్ 100పై విద్యార్థులతో అవగాహన కల్పించారు.సదస్సులో పోలీస్ సిబ్బంది పవన్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు, స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.