Headlines

కొట్టు సమక్షంలో వైఎస్ఆర్సిపి లో చేరిన ఆటో డ్రైవర్లు..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 2:

పలువురు ఆటో డ్రైవర్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఆటో యూనియన్ ఆత్మీయ సమావేశంలో పలువురు సభ్యులు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పార్టీ కండువాలు వేసి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. యూనియన్ పూర్వాధ్యక్షులు తలపాగుల బాబురావు ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పైగా ఆటో డ్రైవర్లు కొట్టు సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తామంతా సమిష్టిగా కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణ ను తాము కోరుకుంటున్నామన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు, కోటన్న అభివృద్ధి, శాంతి భద్రతలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వారు తెలియజేశారు. పార్టీలో చేరిన వారిలో బి.రాము, రాఖీ భాయ్, అయ్యప్ప, మంగళరాజు, గెద్దాడి కృష్ణ, గూడూరి మధుసూదన్ రావు, వై రాజు తదితరులు ఉన్నారు.