Headlines

సంక్షేమప్రభుత్వాన్ని గెలిపించుకుందాం..

న్యూస్ నైన్ టీవీ పులికొండ

ఆభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడిన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామని వెఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక గారి కుమారుడు బుట్టా ప్రతుల్ గారు పిలుపునిచ్చారు. ఆయన 03.04.2024 తేదీన పట్టణంలోని 18 వ వార్డులో కౌన్సిలర్ రంగమ్మ,(వార్డ్ ఇంచార్జ్ సోమేష్ )పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీ పీకి మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని విన్నవించారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలిస్తామంటూ మభ్యపెట్టి మోసగించేందుకు వస్తున్నారని వారిని నమ్మవద్దని ఓటర్లకు సూచించారు. సీఎం జగనన్న నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ ఫలాలు ఐదేళ్లలో పార్టీలకతీతం గా అన్ని వర్గాలకు అందించారన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయక పోవడంతో టీడీపీ ప్రభుత్వాన్ని నాడు ప్రజలు ఇంటికి పంపారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎన్నికలొచ్చాయని మళ్లీ కల్లబొల్లి హామీలు గుప్పించిన టీడీపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. వైఎస్సార్సీపీతోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.మా అమ్మ గారు అయిన శ్రీమతి బుట్టా రేణుక గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి,వేయించి గెలిపించాలని కోరారు

 

ఈ ప్రచారంలో పట్టణ అధ్యక్షులు బుట్టా రంగయ్య, కౌన్సిలర్లు నీలకంఠ, డిష్ కేశవ రెడ్డీ, వార్డు ఇంఛార్జి చంద్రశేఖర్,కో ఆప్షన్ మెంబర్ కొండాపురి అబ్రార్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ రజాక్,కన్వీనర్ గొకారి,నాయకులు ఇలాఖత్,యూసుఫ్, రఘువీరా,గౌస్, శీను ,నర్సింహులు, శీను, నాగరాజు, వీరెష్, తదితరులు పాల్గొన్నారు*