మేము ఉన్నంతవరకు ఇలాంటి సేవలు కొనసాగుతూనే ఉంటాయి..

న్యూస్ 9) యాడికి

మండల కేంద్రంలోని శ్రీ శివ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి వెనకాల నివసిస్తున్న కరెంటు పుల్లయ్య భార్య శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మరణించడం జరిగింది. బంధువులు ఎవరు లేకపోవడంతో యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ కి సమాచారం అందించారు.
యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్,, వేడుకాపుర ఫౌండేషన్ యాడికి లో ఉన్నంతవరకు ఇలాంటి సేవలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. చెన్నకేశవస్వామి గుడి వెనకాల నుంచి కోన రోడ్డు లోని స్మశానం వరకు పాడే మోసుకుంటూ వెళ్లి కరెంటు పుల్లయ్య భార్య అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు చందగాని దృవ నారాయణ, జొన్నల వెంకటేష్, చింతా నరసింహ, టి లక్ష్మీకాంతమ్మ పాల్గొనడం జరిగింది.