Headlines

ఇండియన్ అబకస్ చివరి రాత పరీక్షలకు కదిరి భవిష్య స్కూల్ విద్యార్థులు..

 

కదిరి, న్యూస్ 9, నవంబర్ 26:

 

కదిరి మారుతీ నగర్ లో ఉండే భవిష్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు ఇండియన్ అబాకస్ చివరి రాత పరీక్ష పుట్టపర్తి లోని శ్రీ సాయి విద్యాలయం స్కూల్లో నిర్వహించడం జరిగింది. పరీక్ష అనంతరం విద్యార్థులకు భవిష్య స్కూల్ యాజమాన్యం ఈశ్వర్ విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా శ్రీ సాయి విద్యాలయం యాజమాన్యం సాయి గీత పాల్గొనడం జరిగింది, వీరితోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు భవిష్య స్కూల్ సిబ్బంది అబాకస్ టీచర్ వెంకటగిరి గంగయ్య, పద్మజ, రత్న, మంజుత తదితరులు పాల్గొన్నారు.