బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘనంగా జయంతి వేడుకలు.. మండల అధ్యక్షులు :శంకర్ గౌడ్….

  • రజక సంఘం ఆధ్వర్యంలో….
  • చాకలి ఐలమ్మ ఘనంగా జయంతి వేడుకలు…..

చేరాల. రవీందర్

న్యూస్ 9 tv రిపోర్టర్

పెద్దపల్లి జిల్లా మంథని,

చాకలి ఐలమ్మ 129 వ జయంతి వేడుకలను మంథని పట్టణం ప్రధాన కూడలి లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1895 వ సంవత్సరంలో జెన్మించారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రజక సంఘం నాయకులు గురువారం వేరువేరుగా జరుపుకున్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ నేతలు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రజక సంఘం నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వీర వనిత, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని, భూమికోసం, భుక్తి కోసం, దేసుముక్ రాంచందర్ రెడ్డి మీద పోరాటం జరిపిందని, నాటి దొరల ఆగడాలకు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసిన దీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్ గౌడ్, తగరం శంకర్ లాల్, కాయితి సమ్మయ్య, ఆరెపల్లి కుమార్, గొబ్బూరి వంశీ, ఇర్ఫాన్, కనవేనా శ్రీనివాస్, ఆసిఫ్ ఖాన్, రజక సంఘం నాయకులు కొల్లూరి రాజయ్య, పోతరాజు సమ్మయ్య, పైడాకుల నాగరాజు, పోతరాజు శ్రీనివాస్, లతో పాటు తదితరులు పాల్గొన్నారు.