తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన మంథని ఆర్డివో: హనుమా నాయక్..

న్యూస్ 9 tv రిపోర్టర్

మంథని, పెద్దపల్లి

కరీంనగర్

 

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం,ముత్తారం, మండలం తహశీల్దార్ కార్యాలయాన్ని మంథని ఆర్డీవో హనుమానాయక్ సందర్శించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతు గ్రీన్ఫీల్డు హైవే కింద పోతున్న భూములకు 76 శాతం డబ్బులు మొదటి విడితగా ముట్టాయని అన్నారు. ఇంకా 24 శాతం పెండింగ్లో ఉన్నాయన్నారు. మండలంలో ఓటర్ జాబితో బాగంగా ఇంటింటికి సర్వే 99శాతం పూర్తి చేశారని అన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్, సర్టిఫికెట్స్ సంబందించిన ధరకాస్తులూ ఎలాంటి పెండింగ్లు లేవన్నారు. అనంతరం BLO లకు కిట్లు అందించారు. అధికారులకు తగు సలహాలు, సూచనలు తెలిపారు. ఈ సందర్శనలో తహశీల్దార్ సుమన్, సీనియర్ అసిస్టెంట్ భవానీ ప్రసాద్, గిర్దావర్ శ్రీధర్, సిబ్బంది పాల్గోన్నారు.