అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు.. మంథని ఎస్సై : డేగల రమేష్..

న్యూస్ 9 tv రిపోర్టర్

చేరాల.రవీందర్

మంథని

పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని విలోచవరం గోదావరి నది నుండి మంథని కి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లో తరలిస్తున్నారని సమాచారంతో వెంటనే విలోచవరం వెళ్లేసరికి గ్రామ శివారులో ఒక ట్రాక్టర్ ఇసుకను నింపుకొని ఎదురుగా వస్తుండగా అట్టి ట్రాక్టర్లు ఆపి అనుమతి పత్రాలను అడగగా ఎలాంటి అనుమతి పత్రాలు చూపియ్యకపోవడంతో కేసు నమోదు చేసి అట్టి ట్రాక్టర్ ను సీజ్ చేయడం జరిగినది. డ్రైవర్ వివరాలు: మీసాల నరేష్, విలోచవరం గ్రామం.

ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసు నమోదు చేయడం జరుగుతుందని, మంథని ఎస్ఐ డేగల రమేష్ తెలిపారు.