కార్మిక శాఖ కార్యాలయం సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించాలి.. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్..

న్యూస్ 9 tv

మంథని

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రంలో గల కార్మిక కార్మిక శాఖ కార్యాలయం చుట్టూ భవన కార్మికులు తిరుగుతున్న ఇంటర్నెట్ సాంకేతిక సమస్య తలెత్తుతుందని దీనివల్ల భవన నిర్మాణ కార్మికులు దరఖాస్తుదారులు మరియు లేబర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నిరాశ చెందుతూ

… ఏమి చేయాలో తెలియక వెను తిరిగి వెళ్ళిపోతున్నారు. లబ్ధిదారులు క్లైమ్ చేసుకునే విషయంలో గడువు దాటిపోతే స్కీంకు దూరమవుతారని దీనికి బాధ్యులు ఎవరని బూడిద గణేష్ ప్రశ్నించారు. ఇప్పటికైనా భవాని నిర్మాణ కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వెంటనే కార్మిక శాఖ కార్యాలయం లో నెలకొన్న ఇంటర్నెట్ సాంకేతిక సమస్యను పరిష్కరించాలి అని తెలిపారు. లేని యెడల భవన నిర్మాణా కార్మికులను అందరినీ సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సభ్యులు బూడిద గణేష్ హెచ్చరించారు.