అవగాహన సదస్సు… సీఐ, భి రాజు గౌడ్.. ఎస్ఐ, డి రమేష్.. 

న్యూస్ 9 tv రిపోర్టర్

చేరాల. రవీందర్

మంథని, పెద్దపల్లి

 

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయిన్ పేటలో బుధవారం రోజున మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ B రాజు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆడెపు రాకేష్, మంథని ఎస్సై డి రమేష్, ఎక్సైజ్ ఎస్సై దాసరి సాయికుమార్ ల ఆధ్వర్యంలో మంథని సర్కిల్లోని పోలీస్ సిబ్బందితో కలసి గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి గ్రామంలోని స్థితిగతులను అడిగి తెలుసుకోవడం జరిగింది .గ్రామంలోని యువత గంజాయి గుడుంబా మరియు మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వాటి వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించి చెప్పడం జరిగింది . గుడుంబా గంజాయి మరియు మత్తు పదార్థాలు ఎవరైనా సేవించిన విక్రయించిన వారి వివరాలను పోలీసు వారికి చేరవేయాలని చెప్పడం జరిగింది. గ్రామంలోని ప్రజలు అందరూ ఐకమత్యంగా ఉండి గ్రామంలో ఎటువంటి గుడుంబా గంజాయి మొదలైన మత్తుపదార్థాలు గ్రామంలోనికి రానీయకుండా అందరూ కలిసి పని చేయాలని ప్రజలను కోరడం జరిగింది. గుడుంబా మరియు గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఎవరైనా రవాణా చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడం జరిగింది.మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చిన వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పడం జరిగింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థిని విద్యార్థులు ఎటువంటి గొడవలలో తలదూర్చకూడదని సూచించారు.అంతేకాకుండా సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. మీకు తెలియని ఏదైనా ఫోన్ నెంబర్ నుండి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చి మిమ్మల్ని ఏవైనా ప్రలోభాలకు గురి చేసిన వెంటనే మీరు 1930 నెంబర్ కు కాల్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని సూచించడం జరిగింది.సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవరైనా అనుచిత పోస్టులు పెట్టిన అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని చెప్పడం జరిగింది. గ్రామంలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడిన అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడును అని చెప్పడం జరిగింది. మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించడం జరిగింది మీకు ఎటువంటి సమాచారం తెలిసిన తక్షణమే 100 నెంబర్ కు కాల్ చేసి పోలీస్ వారి సహాయం తీసుకోవాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమం లో మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ భి. రాజు గౌడ్, సబ్ ఇన్స్పెక్టర్ డి. రమేష్, పోలీస్ సిబ్బంది తో పాటు యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.