పండగ పూట వృద్ధురాలి ఆకలి తీర్చిన బూడిద గణేష్.. మంథని పట్టణంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలి: బూడిద గణేష్…

పెద్దపల్లి, మంథని:

(అక్టోబర్ 11)

పెద్దపల్లి జిల్లా
మంథని పట్టణంలో ఆకలితో అలమటిస్తూ సంచరిస్తున్న వృద్ధురాలికి వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ భోజనం అందించి వృద్ధురాలి ఆకలి తీర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ఎందరో వృద్ధులు బుక్కెడు బువ్వ కోసం జన్మనిచ్చిన కుమారుల నుండి ఆదరణ నోచుకోలేక కోర్టు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ చివరి మజిలీ దశలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . కుటుంబ సభ్యుల ఆదరణకు నోచుకోలేని వృద్ధ దంపతులను ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అక్కున చేర్చుకోవాలని ఇలాంటి వృద్ధుల కోసం మంథని నియోజకవర్గంలో వృద్ధాశ్రమం ఏర్పాటుచేసి వారి సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాబు రవి ఉన్నారు.