Headlines

హైద్రాబాద్‌లో ఎన్ఎస్ఎ అజిత్ దోవల్ రహస్య పర్యటన….కొందరు కీలక వ్యక్తులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారట

జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఎ) అజిత్ దోవల్, హైద్రాబాద్‌లో అత్యంత రహస్యంగా పర్యటించారు. దాదాపు మూడు గంటలపాటు ఈ పర్యటన జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా అజిత్ ధోబాల్ పర్యటన అంటే, నిఘా వర్గాలకు సమాచారం వుంటుంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగానికీ ఖచ్చితమైన సమాచారం ఇస్తారు. కానీ, అస్సలేమాత్రం ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైద్రాబాద్ వచ్చారు అజిత్ ధోబాల్. మూడు గంటలపాటు హైద్రాబాద్‌లో.. దాదాపు మూడు గంటలపాటు హైద్రాబాద్‌ లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన అజిత్ ధోవల్, కొందరు కీలక వ్యక్తులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారట.

రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఐటీ విభాగం వరుస దాడుల నేపథ్యంలో అజిత్ ధోవల్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడు గంటల పర్యటన అంతరం, ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాపులర్ ఫ్రంట్ వ్యవహారానికి సంబంధించి కొన్ని లింకులు హైద్రాబాద్‌లోనూ దొరికిన దరిమిలా, అజిత్ దోవల్ పర్యటన వెనుక అత్యంత కీలకమైన అంశాలే వుండి వుంటాయని అంటున్నారు. మరోపక్క, పాకిస్తాన్‌ లో భారత సైన్యం తరఫున గూఢచారిగా వ్యవహరించారు అజిత్ దోవల్ గతంలో. స్వర్ణ దేవాలయం ఘటనలోనూ అజిత్ దోవల్ గూఢ చర్యం గురించి కొత్తగా చెప్పేదేముంది.?