ఈ విధి విధానాలతో జీవితంలో రాజయోగం!!

చాలామంది తెలిసీ తెలియక చేసిన తప్పులు వల్ల వాస్తు దోషాలు ఏర్పడి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలో రాజయోగంతో పాటు అష్టైశ్వర్యాలు లభించాలంటే ప్రతినిత్యం కొన్ని విధులను ఆచరించాలని చెబుతున్నారు.ముఖ్యంగా ఆర్థికంగా లబ్ధిని చేకూర్చే ఈ పనులు చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలగడం తథ్యమని చెబుతున్నారు.

ప్రతి శనివారం ఇంట్లో పగిలిన, విరిగిన వస్తువులను పడేయాలని, ఇంట్లో బూజు లేకుండా శుభ్రంగా జరుపుకోవాలని, ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. ధన ప్రాప్తి కోసం అమ్మవారి ఉపాసన చేయాలని చెబుతున్నారు. అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని పెట్టి పూజించినట్లయితే ధన ప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు. ప్రతి రోజు పూజలో శ్రీ సూక్తం తప్పని సరిగా చదివితే సానుకూల ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

ఇక ఏ ఇంట్లో అయితే మహిళలు ఏడవకుండా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని చెబుతున్నారు. ఉదయం లేవగానే రెండు అరచేతులను చూసి నాలుగైదు సార్లు ముఖంపై తిప్పటం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు. పూజగదిలో తప్పనిసరిగా ఏకాక్షి కొబ్బరికాయ ఉంచడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు.

డబ్బు పెట్టే చోట కొన్ని అక్షింతలు, 4 లక్ష్మీ గవ్వలు, నాలుగు శ్రీ ఫలాలు, నాలుగు ఆకుపచ్చ గాజులు, శ్రీ సూక్తం చదివి పెడితే డబ్బుకు లోటు లేకుండా ఉంటుందని చెబుతున్నారు.డబ్బులు పొదుపు చేయదలచుకుంటే భరణి నక్షత్రంలో పొదుపు చేయాలని, డబ్బు ఇబ్బందిగా ఉంటే చిన్న పిల్లలకు స్వీట్లు పంచాలని, అవసరానికి మించి డబ్బులు రాకపోతే కులదైవానికి మొక్కులు చెల్లించుకోవడం చేయాలని చెబుతున్నారు.