గోపాలపురం ఉమా బలేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి

 

రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో శిథిలావస్థకు చేరిన పురాతన ఉమాబలేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి సి.జి.ఎఫ్ నిధుల నుండి మాచింగ్ గ్రాంట్ 75 లక్షల రూపాయలు మంజూరు చేయించి శనివారం శంకుస్థాపన కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ నియోజకవర్గంలో సి.జి.ఎఫ్ గ్రాంట్ నుండి ఉమాబలేశ్వర స్వామి వారి దేవస్థానంలో పాటూ 50 లక్షల రూపాయలతో గోపాలపురం వేణుగోపాల స్వామి వారి దేవాలయం పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకోవడం జరిగింది అని, చింతలూరు నూకాంబిక అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణానికి 1కోటి రూపాయల సి.జి.ఎఫ్ మాచింగ్ గ్రాంట్ మంజూరు చేయించుకోవడం జరిగింది అని, నియోజకవర్గంలో శిథిలావస్థకు చేరిన ఇతర దేవాలయాల పునర్నిర్మాణ ప్రతిపాదనలు కూడా పై అధికారులకు పంపించడం జరిగింది అని అలాగే సుమారు 80 రామాలయాల అభివృద్ధికి టీటీడీ నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపించామని అన్నారు.