Headlines

కుప్పకూలిన స్టేజ్… రాజప్ప కు గాయాలు…

ఏలూరు జిల్లా నూజివీడు
మండలం బత్తులవారిగూడెంలో తెలుగుదేశం
ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో
పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
ఈ క్రమంలో స్టేజ్ పైకి పరిమితికి మించి
నాయకులు, కార్యకర్తలు రావడంతో
ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో
తెదేపా సీనియర్ నేతలు చింతమనేని ప్రభాకర్,
నిమ్మకాయల చినరాజప్ప, తదితరులు స్టేజ్ పై
నుంచి కింద పడిపోయారు. అప్రమత్తమైన
కార్యకర్తలు నాయకులను పైకి లేపి సురక్షిత
ప్రదేశానికి తీసుకెళ్లారు