Headlines

డిప్యూటీ సీఎం కొట్టు ను కలిసిన తాడేపల్లిగూడెం కొత్త డిఎస్పి..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 17:

 

తాడేపల్లిగూడెం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి ఎస్ ఆర్ వి ఎస్ ఎన్ మూర్తి శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బదిలీల్లో భాగంగా మూర్తి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇంతవరకు ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన శరత్ రాజ్ కుమార్ బదిలీపై వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో బదిలీపై ఇక్కడికి వచ్చిన మూర్తి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి కొట్టును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో రాజీలేని ధోరణి అవలంబించాలని మంత్రి కొట్టు డిఎస్పి మూర్తికి సూచించారు. దానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు.