Headlines

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు..

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని కదిరి పట్టణంలోని ఏడవ వార్డులో శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కౌన్సిలర్ కిన్నెర కళ్యాణ్ ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బి ఎస్ మక్బూల్, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ, రాష్ట్ర సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, మాజీ రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వార్డులోని ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించి ఎన్నికలలో ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు.

ఈ ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.