Headlines

యాడికి మండలంలోనిఘనంగా పెద్దమ్మ తల్లి ఉత్సవ విగ్రహ ప్రాణప్రతిష్ట..– ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే..

న్యూస్.9)

యాడికి మండల పరిధిలోని పిన్నేపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఉత్సవ విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండి పెద్దమ్మ తల్లి అమ్మవారికి పురోహితులు అభిషేకాలు, కుంకుమార్చనలు, నవగ్రహ పూజ, ప్రాణ ప్రతిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిష్ట అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ ప్రతిష్ట పూజా కార్యక్రమాలకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైసీపీ సీనియర్ నాయకులు బాల రమేష్ బాబు మాజీ జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.