బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ పాలన పైన జగత్ ప్రకాశ్ నడ్డా పలు ఆరోపణలు చేసారు.
రాష్ట్రంలో కుంభకోణాలకు విరామం లేదని వ్యాఖ్యానించారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసారని ఆరోపించారు.
రాయలసీమ అభివృద్ధిని కూడా వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని.. ఒక్కసారి బీజేపీకి అవకాశమిస్తే సీమను వృద్ధి బాటలోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పొత్తులపై చర్చ వేళ నడ్డా కామెంట్స్ కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి.
వైసీపీ పాలనపై ఆరోపణలు: చూడలేదన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ పాలన 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన ‘జనసంపర్క్ అభియాన్’లో భాగంగా శ్రీకాళహస్తి బహిరంగ సభలో నడ్డా ప్రసంగించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు మోదీ నిరంతరం శ్రమిస్తుంటే.. ఆంధ్రలో మాత్రం దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. కేంద్ర నిధులను దారిమళ్లిస్తూ అసమర్థ ప్రభుత్వంగా వైసీపీ నిలిచిందని చెప్పారు.