లేడీ డాక్టర్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్, మెడికల్ కాలేజ్ డాక్టర్ అందర్, ఏం జరిగిందంటే ?

బెంగళూరు/కోలారు/బళ్లారి: ఎంబీబీఎస్ పూర్తి చేసి తరువాత ఉన్నత చదువుల కోసం ప్రముఖ మెడికల్ కాలేజ్ లో చదువుతూ ఉద్యోగం చేస్తున్న యువతి ఆత్మహత్య కేసు ఊహించని మలుపు తిరిగింది.

లేడీ డాక్టర్ ఆత్మహత్య కేసులో అదే మెడికల్ కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్న సీనియర్ డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఇంకా నాలుగురు లేదా ఐదు మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని స్వయంగా పోలీసులు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

ఆంటీతో అక్రమ సంబంధం, మేడమ్ సొంత ఇంటి మీద కన్ను, ముక్కలుగా నరికేసి !

బెంగళూరు రూరల్ జిల్లా హోస్ కోటేలోని ఎంవీజే మెడికల్ కాలేజీలో ఎండీ చదువుతున్న విద్యార్థిని దర్శిని కోలార్ తాలూకాలోని కెందట్టి గ్రామంలో క్వారీలో పడి ఆత్మహత్య చేసుకుంది. హోస్ కోటే లోని ఎంవీజే మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్ ఎండీ చేస్తున్న దర్శిని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

 

గత ఆదివారం ఉదయం కాలేజీ వదిలి నేరుగా కోలార్ తాలూకా కెందట్టి సమీపంలోని క్వారి దగ్గరకు వెళ్లింది. చెప్పులు, మొబైల్ ఫోన్ తీసి క్వారీ బయటపెట్టింది. అదే సమయంలో తన స్నేహితుడు మణికి ఫోన్ చేసిన దర్శిని తాను మానసిక ఒత్తిడిలో ఉన్నానని, డిప్రెషన్ నుంచి బయటకు రాలేకపోతున్నానని చెప్పంది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని దర్శిని ఆమె స్నేహితుడు మణికి చెప్పింది.