Headlines

గౌరవనీయులైన మల్లు భట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత BTPS సందర్శించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, 

తేదీ:-30.12.23

 

ప్రెస్ నోట్

 

గౌరవనీయులైన మల్లు భట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత BTPS సందర్శించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ,

సింగరేణిలో 56 డిపార్ట్మెంట్ లలో పనిచేసే సుమారు 30,000 మంది కాంట్రాక్టు కార్మికులకు పనిచేస్తున్నారు. వారికి సుప్రీంకోర్టు 2017తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని లేదా మొదటి క్యాటగిరి వేతనం ఇవ్వాలని లేదా జీ.ఓ.నెం.22 గెజిట్ చేయాలని, చట్టబద్ద సౌకర్యాలు అమలు చేయాలని, పండుగ & జాతీయ సెలవులు అమలు కావాలని, లాభాల్లో వాటా ఇవ్వాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (PSCWU) IFTU అనుబంధం మణుగూరు బ్రాంచి ,తరపున మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆర్.మధుసూదన్ రెడ్డి ,P.సంజీవరెడ్డి మరియు బ్రాంచి నాయకులు కార్తీక్, జంపయ్య,సారయ్య తదితరులు పాల్గొన్నారు.