Headlines

మల్కాజ్గిరి గడ్డ… కాంగ్రెస్ అడ్డ….

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మల్కాజ్ గిరిలో ఊపందుకున్న ప్రచారం.. మల్కాజ్గిరి 140 డివిజన్ ప్రెసిడెంట్ జీడి సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కి మద్దతుగా శనివారం పటేల్ నగర్ లో ప్రచారం నిర్వహించారు…

ఈ సందర్భంగా డివిజన్ ప్రెసిడెంట్ జీడి సంపత్ గౌడ్ మాట్లాడుతూ… మల్కాజ్గిరి గడ్డ… కాంగ్రెస్ అడ్డా.. అని.. మల్కాజ్గిరి లో ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని.. ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆసక్తితో… హామీల అమలుపై ఉన్న కమిట్మెంట్ చూసి… కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని… పట్నం సునీత గెలుపును ఎవరు అడ్డుకోలేరని… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి చరిత్ర సృష్టిస్తుందని… ప్రతి ఇంటికి కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి… చేసే అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ.. ప్రచారం కొనసాగిస్తున్నామని… తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు…

ప్రచార కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొండ గౌడ్,రవీందర్ రెడ్డి,గౌస్సుధీన్,భాస్కర్,నాగేందర్ గౌడ్,రఘు యాదవ్,మహేందర్ గౌడ్,ఉప్పేందర్,నగేష్ గౌడ్,నల్లవెళ్ళీ రాజు,సాయినాథ్ గౌడ్,నరేందర్ గౌడ్,యూత్ నాయకులు గణేష్ గౌడ్,నగేష్ ములుగు,అసిమ్మ్, అభిమానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు…