Headlines

ఈదురుగాలులకు తాడిచెట్టు పడి కౌలు రైతు మృతి

 

అకస్మాత్తుగా వచ్చిన ఈదురు గాలులకు తాడిచెట్టు పడి కౌలు రైతు మృతి చెందిన సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్లలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు కథను ప్రకారం శనివారం సాయంత్రం డేగల సత్యనారాయణ (47) తిర్నాతి నాగుతో కలిసి వంగతోటలో పురుగుమందు పిచికారి చేస్తున్నారు. ఒక్కసారిగా ఈదురుగాలులు రావడంతో వారిరువురూ పరిగెత్తుకుని దగ్గరలో ఉన్న మోటార్ పాకలోకి వెళ్లారు. అయితే వేగంగా వేసిన ఈ గాలులకు తాటి చెట్టు ఆ పాక పై కూలిపోయింది. దీంతో సత్యనారాయణ మోటర్ బోర్ లో పడి అక్కడికక్కడే మృతి చెందారు. నాగు కాళ్లపై స్వల్ప గాయాలతో బయటపడ్డారు.సత్యనారాయణ భార్య దుర్గ అంగనవాడీ టీచర్ గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు కాగా ఇటీవలనే పెద్ద కుమార్తె పెద్దాపురం ఓ కాలేజీలో చదువతూ ఆత్మహత్య చేసుకుంది.ఆ భాదలనుండి కోలుకోకుండానే ఇంటి పెద్ద దిక్కు మృతి చెందడంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.