Headlines

తెదేపా ఇంచార్జ్ అస్మిత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన చందన, రాయల్ చెరువు గ్రామ ప్రజలు…

న్యూస్.9)

 

యాడికి మండల టిడిపి నాయకులు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం, చందన, రాయల చెరువు లో పర్యటించిన తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డి. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల నుండి అపూర్వ ఆదరణ లభించింది. ముఖ్యంగా గ్రామంలో మహిళలనుండి అపూర్వ స్వాగతం లభించింది . తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటింటికీ వివరించి వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డి.

 

ధరలు పెంచి పేదల నడ్డి విరిచిన జగన్ రెడ్డిని గద్దె దించితేనే రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయని, వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ని చేసుకుందామని కోరిన ఎమ్మెల్యే అభ్యర్థి అస్మిత్.

జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి , బిజెపి నాయకులు మాజీ ఎంపీపీ వేలూరి రంగయ్య, మండల కన్వీనర్ రుద్రమ నాయుడు, పరిమి చరణ్, మాదాల అనిల్ కుమార్, జాఫర్, తాండ్ర విక్రమ్, తిరం పురం నీలకంఠ, గండికోట లక్ష్మణ్ ,సెల్ పాయింట్ చాంద్ బాషా, విశ్వనాథ్, కరెంటు రహమతుల్లా, సుభహాన్, మాయ కుంట్ల నారాయణస్వామి, వెలిగండ్ల ఆదినారాయణ, నరసింహ చౌదరి, చంద్రశేఖర్ రెడ్డి, కోడూరు నీలకంఠారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు