భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మే డే కార్మిక దినోత్సవం సంబరాలు…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా పలు గ్రామాల్లోని వాడవాడల్లో ఉవ్వెత్తున కార్మిక జెండాలు ఎగిరాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంధ్రంలోనీ భారతిభవన్ లో బుధవారం ఉదయం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మిక జెండా రెపరెపలాడింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షు లు ప్రభాకర్, రాము లు మాట్లాడుతూ చికాగో నగరంలో కార్మికులు ఎనిమిది గంటల పని వేళలు కోసం పోరాడి తమ హక్కులు సాదించుకున్నారని ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రపంచ కార్మికులారా ఏకంకండి అనే నినాదంతో కార్మికుల దినోత్సవంగా మేడే జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు కార్మిక సంఘం ముఖ్య సలహాదారులు నాగ మురళి, వెంకటేశ్వర్లు రాంబాబు ఉపాధ్యక్షులు రామకృష్ణ లతో పాటు కార్మిక సంఘం సభ్యులు కృష్ణ,ఏసు,వెంకన్న,బండ్ల కృష్ణ,సాయికుమార్,లక్ష్మణ్,రమణ,శ్రీను,కృష్ణ ముత్యాలు పలువురు పాల్గొన్నారు.