Headlines

బత్తలపల్లి అర్డిటి ఆస్పత్రిలో రెండు రోజులుగా రక్తం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు చిన్నారులకు రక్తదానం

బత్తలపల్లి అర్డిటి ఆస్పత్రిలో రెండు రోజులుగా రక్తం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు చిన్నారులకు రక్తదానం చేయడం జరిగిందని మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ యాడికి శాఖ ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ తెలిపారు. వివరాల మేరకు గుంతకల్లు మండలం వెంకటాంపల్లి గ్రామంలో నివసిస్తున్న జయరాం నాయక్ ( 5సం”) కుమారుడు గౌతమ్ నాయక్ ఓ పాజిటివ్ కోసం మరియు అదే గ్రామంలో నివసిస్తున్న మౌనిక కూతురు భార్గవి (6సం”) బి పాజిటివ్ కోసం ఇద్దరు తల సేమియా చిన్నారులు రెండు రోజులుగా రక్తదాతల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో యాడికి ఫౌండేషన్ వారికి కాల్ చేయడంతో ధర్మవరం పట్టణంలో నివసిస్తున్న సిరివెళ్ల దేవేంద్ర మరియు అతని స్నేహితుడు బండారు చంద్రశేఖర్ ఇద్దరు ధర్మవరం నుంచి బత్తలపల్లి కి వెళ్లి రక్తదానం చేయడం జరిగింది. రక్తదాతల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఇద్దరు రక్తదాతలను పంపించి రక్తదానం చేయించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని ఇద్దరు పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఫౌండేషన్ ద్వారా ఫోన్ చేయగానే క్షణం ఆలస్యం చేయకుండా ధర్మవరం నుంచి బత్తలపల్లికి వెళ్లి రక్త దానం చేసిన ఇద్దరు రక్తదాతలకు ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.యాడికి లో కానీ మరెక్కడైనా కానీ రక్తం కావాల్సినవారు రక్తదానం చేయాల్సినవారు యాడికి ఫౌండేషన్ ని ఈ క్రింది నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
9912099782,8686808333