Headlines

బూత్ స్థాయిలో బిజెపిని బలోపేతం చేయాలి. — బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ.

 

బూత్ స్థాయి నుండి బిజెపిని బలోపేతం చేసేందుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఇస్తున్న అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గురించి ప్రజలకు వివరించాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ అన్నారు. కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం జొన్నాడ జాతీయ రహదారి సమీపంలో గల బిసి కమ్యూనిటీ హాలులో నియోజకవర్గ బూత్ సశక్తికరణ సమావేశం బిజెపి నియోజకవర్గ కన్వీనర్ అయినవిల్లి సత్తిబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కర్రి చిట్టిబాబు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బిట్ర శివన్నారాయణ మాట్లాడుతూ మహిళలకు, గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం దానికి నిధులు పూర్తిగా కేంద్రం అందిస్తుందనీ, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఉచిత మరుగుదొడ్లు నిర్మించుకొనే నిధులు, మహిళలకు సూక్ష్మ రుణాలు డ్వాక్రా రుణాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందనని, రైతులకు యూరియాలో 2500 వరకు సబ్సిడీ అందిస్తుందనీ, ఉపాధిహామీ పధకం ద్వారా వందరోజులకు సుమారు వంద రూ.27,000 లు ఉపాధి ద్వారా అందిస్తుందని, ఇలా అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రానికి కేంద్రం అందిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలందరికీ వివరించి బూత్ స్థాయిలో బలోపేతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర స్వచ్ఛభారత్ సెల్ కన్వీనర్ పాలూరి సత్యానందం, రాష్ట్ర ఆర్గానిక్ సెల్ కన్వీనర్ తమలంపూడి రామ కృష్ణారెడ్డి, ఐటి సెల్ కన్వీనర్ శివకుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిష్టా కుటుంబరావు, జిల్లా ఒబిసి మోర్చ అధ్యక్షులు త్రినాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ నారాయణ, జిల్లా ట్రెజరర్ చేకూరి రమేష్ వర్మ, కొత్తపేట నియోజకవర్గ కో కన్వీనర్ కోటిపల్లి దామోదర్, ఆలమూరు, రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట మండలాల అధ్యక్షులు నాగిరెడ్డి స్వామి, కొవ్వూరి కృష్ణారెడ్డి, నడింపల్లి సుబ్బరాజు, పాలాటి మాధవస్వామి వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.