మల్కాజ్గిరి బిజెపి ఎం.పీ శ్రీ ఈటల రాజేందర్ గారు, మల్కాజ్గిరి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆర్ యు బి, భూగర్భ డ్రైనేజ్, ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరణ వంటి అనేక సమస్యలు పరిష్కరించేందుకు తాను ప్రజలతో ఉంటానని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఎంపీగా తనను గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం మల్కాజ్గిరి ప్రజలకు అందుబాటులో ఉంటానని సమస్యలను కేంద్ర పెద్దలతో, రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరగా సమస్యలను పూర్తి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ వినాయక్ నగర్ డివిజన్ కార్పొరేటర్ రాజలక్ష్మి కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో, సమావేశంలో పాల్గొన్నారు.