ఎమ్మిగనూరు మండలం గువ్వలుదొడ్డి,పెసలదిన్నె,గార్లదిన్నె, గ్రామాల ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక గారు సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారికి రోడ్ షో లో గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు…

న్యూస్ నైన్ టీవీ YGR

ఎమ్మిగనూరు మండలం గువ్వలుదొడ్డి,పెసలదిన్నె,గార్లదిన్నె, గ్రామాల ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక గారు సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారికి రోడ్ షో లో గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

30.04.2024 తేదీన ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డి, పెసలదిన్నె, గార్లదిన్నె గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు, సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక గారు మాట్లాడుతూ మీరు నాకు ఒక్క సారి అవకాశం ఇస్తే రోడ్లు, డ్రైనేజీలు,వాటర్ సమస్య తీర్చి ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని. మీ అమూల్యమైన ఓట్లను మంచి చేసే జగనన్నకే ఓటు వేయాలని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు, ఎంపీ అభ్యర్థి అయిన బి వై రామయ్యకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి వేయించాలని అభ్యర్థించారు.

ఈ ప్రచారంలో రాష్ట్ర వీర శైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్ర గౌడ్, మండల అధ్యక్షులు బిఆర్ బసిరెడ్డి, సోగునూరు భీమిరెడ్డి, ఎంపీపీ కేశన్న, ఆయా గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు,నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.