లండన్: అమెరికాలోని న్యూయార్క్ నగరం నుంచి దిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా (Air India) విమానాన్ని లండన్కు మళ్లించారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానే దీన్ని లండన్కు దారి మళ్లించి హిత్రూలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
సంబంధిత ప్రయాణికుడిని దించిన తర్వాత విమానం లండన్ నుంచి దిల్లీకి బయల్దేరుతుందని పేర్కొన్నారు. అయితే, ఏ రకమైన మెడికల్ ఎమర్జెన్సీ అనేది మాత్రం సమాచారం లేదు. దీంతో ఈ నాన్ స్టాప్ విమానం షెడ్యూల్ కన్నా 6-7గంటలు ఆలస్యంగా దిల్లీకి చేరుకొనే అవకాశం ఉందని సమాచారం. ఈ విమానంలో దాదాపు 350మందికి పైగా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.