Headlines

కడియపులంక కాషాయ మయం మార్మోగిన జై శ్రీరామ్ నినాదం

 

నర్సరీలకు,పువ్వులకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక కషామయమైంది.జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది.మహాశివరాత్రి సందర్భంగా దశాబ్దాల చరిత్ర కలిగిన కడియపులంక అంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా గురువారం వేలాదిమంది భక్తులు గ్రామోత్సవం నిర్వహించారు. హనుమాన్ మాలాదారణ చేసిన భక్తులతో పాటు నర్సరీ రైతులు, పూల వ్యాపారులు,గ్రామస్థులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ ఆలయ కమిటీ నూతన అధ్యక్షులుగా ప్రముఖ నర్సరీ రైతు పల్ల సుబ్రహ్మణ్యం ఇటీవల చేపట్టారు.ఆయన తనదైన శైలిలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం రాత్రి జాతర కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు