Headlines

పెద్ద మనసు చాటుకున్న కొత్తపేట శెట్టిబలిజి యువత కష్టాల్లో ఉన్న తల్లికి 20 వేల రూ.ఆర్థిక చేయూత

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్త పేట మండలం, గంటి పల్లి పాలెంకు చెందిన అంబటి విజయ సాగర్ తన తల్లి అంబటి మాణిక్యంకు నాలుగు నెలల క్రితం కాళ్ళు క్రింద సిరలలో రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల భీమవరం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో సుమారుగా ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏంజియోప్లాస్టి చేయించారు అది సక్సెస్ కాకపోవడం వల్ల పరిస్థితి విషమించడంతో కాలు తీసేసారు. ప్రస్తుతం తీసేసిన కాలు గాయం పూర్తిగా తగ్గకముందే మళ్ళీ కుడికాలు కి రక్తప్రసరణ ఆగిపోయిందని వెంటనే మళ్ళీ ఈ రెండో కాలు కి ఏంజియోప్లాస్టి చేయాలంటే 2లక్షలు పైనే ఖర్చు అవుతుందని చేయించకపోతే కాలు తీసేవేయాలని డాక్టర్లు తెలిపారు.వివిధ న్యూస్ పత్రికల్లో వచ్చిన కథనాలు ద్వారా విషయము తెలుసుకున్న కొత్తపేట మండల యువ శెట్టి బలిజ సంఘం వారు ఆ తల్లి యొక్క ఆరోగ్య పరిస్థితిని, కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి చలించిపోయి ఆమె వైద్య చికిత్స నిమిత్తం 20 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అదే విధంగా ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆ తల్లికి శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని యువ శెట్టి బలిజ సంఘ సభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు బొక్కా ప్రసాద్, గౌరవ సలహాదారు కొప్పిశెట్టి వాసు, ఖండ్రిగ ఉప సర్పంచ్ కడలి పార్థసారథి,జాయింట్ సెక్రటరీ 1.కడలి భీమా,2.జోగి మురళి, ట్రెజరరి కముజు తాతాజీ, వాసంశెట్టి శ్రీనివాస్, కూడిపుడి గణపతి, సానబోయిన సురేష్,కముజు శ్రీను,రాయుడు కార్తిక్, కేతా సతీష్, దంగేటి నాని, యనమదల వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.