Headlines

మహిళా సాధికారత టిడిపితోనే సాధ్యం.–:జిల్లా టిడిపి అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి.

రామచంద్రపురం : మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడే సాధ్యమవుతుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి అన్నారు. రామచంద్రపురం లో మహిళా దినోత్సవం సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా అనంత కుమారి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మహిళలు ఎంతో అభివృద్ధి సాధించారన్నారు. మహిళలను ప్రోత్సహిస్తూ అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు అన్యాయాలు ఎక్కువైపోయాయి అన్నారు. మళ్లీ మహిళలకు రక్షణ కావాలన్నా మహిళలు సాధికారత సాధించాలన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.అనంతరం

నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు జాస్తి విజయలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ హయాంలోనే డ్వాక్రా మహిళా సంఘాల ఏర్పాటు, అన్ని రంగాలలో సమానంగా హక్కు కల్పించి మహిళలు ఎదగటానికి కారణమైన పార్టీ తెలుగుదేశంపార్టీ అని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా , నియోజకవర్గంలో రెడ్డి సుబ్రహ్మణ్యం గారు శాసనసభ్యునిగా గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పెంకే అన్నపూర్ణ, వంజరపు రాజేశ్వరి, బళ్ళ లక్ష్మి , ఖండవల్లి దుర్గాదేవి, దొమ్మలపాటి విజయలక్ష్మి, వాసంశెట్టి నాగమణి, చొల్లంగి భానుప్రియ,సూదంశెట్టి వనిత, కోనాల అనంతలక్ష్మి, మాసాబత్తుల సత్యవతి, బొమ్మిడి సోమాలమ్మ, దుర్గ భవానీ, లావణ్య , అప్పయ్యమ్మ, పెందుర్తి జయలక్ష్మీ, పలివెల వరలక్ష్మి, వడగల శేషవేణి , వినకోటి జ్యోతి , రాయుడు గౌతమి, తటవర్తి సత్యవతి మరియు నియోజకవర్గ , మండల తెలుగుమహిళ కమిటీల సభ్యులు , స్వయం సహాయక సంఘాల మహిళలు , స్వచ్ఛంధ సంస్థల మహిళలు, తెలుగు మహిళలు హాజరైనారు.