Headlines

తెలుగు బాషకు రామోజీ రావు అమోఘమైన సేవ..!!

న్యూస్ 9 వైజాగ్ :-ప్రింట్, బ్రాడ్ కాస్ట్ మీడియాకు సంబందించిన ఈనాడు, ఈ టీవీతో పాటు అనేక వాణిజ్య సంస్థలను సృష్టించి,కొత్త పుంతలను తొక్కిన చెలుకూరి. రామోజీ రావు మృతి పట్ల నేషనల్ అలీయన్స్ అఫ్ జర్నలిస్ట్ (ఆన్ అ జె )అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎస్.కే పాండే. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకట రావు, జి. ఆంజినేయులు మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ కన్వీనర్లు వి. శ్రీనివాస్, కే. మునిరాజ్ ప్రగాఢ సంతాపం వ్యక్తపరిచారు మీడియా లో కొత్త వరవడి సృష్టించి సాహితీ రంగాన్ని కి ఎనలేని సేవలు అందించిన రామోజీ రావు మరణం విచారకరం తెలుగు బాష కు అమోఘమైన సేవ చేశారు, వాడుక భాష ను తీసుకురావడంలో కీలక పాత్ర పోసించడంతో అటు మీడియా రంగం, ఇటు వాణిజ్య రంగం లో చేరువ చేసిన ఘనత రామోజీ రావు దే… అయన మృతి పట్ల (ఆన్ ఏ జె )(ఏ పి డబ్ల్యూ జే ఫ్ )బి జే ఏ లు కన్వీనర్లు, అధ్యక్షులు, రామోజీ రావు కుటుంబo కు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.