Headlines

వినాయకుడు సేవలో మంత్రి బొత్స సత్యనారాయణ, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు

చిత్తూరు జిల్లా : కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయకున్ని దర్శించుకోవడం ఆనందంగా వుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్వామివారిని విద్యాశాఖ మంత్రి, ఆయన సతీమణి మాజీ ఎంపి బొత్స ఝాన్సీ లతో పాటు కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. వీరితో పాటు చిత్తూరు శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు స్వామివారినీ దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన దేవస్థానం ఈ.వో వెంకటేశు…
ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ రేణుక, చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి విజయేంద్ర రావు, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పరివేక్షకులు కోదండపాణి, శ్రీనివాస్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, బాబు, తదితరులు పాల్గొన్నారు.