Headlines

రంగరాజు అకాల మృతి పార్టీకి తీరనిలోటు —-ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి

 

వై.యస్.ఆర్.సి.పి. సీనియర్ నాయకులు, దివంగత నేత చిర్ల సోమసుందర రెడ్డి గారి ముఖ్య అనుచరులలో ఒకరైన తాడిపూడి గ్రామానికి చెందిన సరిపెళ్ళ రంగరాజు అనారోగ్యంతో మృతిచెందడం పార్టీకి తీరని లోటు అని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వసంతవాడ లిఫ్ట్ ఇరిగేషన్ పనితీరును పర్యవేక్షిస్తూ, పార్టీ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఎంతో చురుగ్గా పాల్గొనేవారని, ఆయన పార్టీ కోసం చేసిన కృషి ఎనలేనిదని చిర్ల అన్నారు.

ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అంతిమ యాత్రలో పాల్గొన్నారు.