Headlines

తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ బగ్గు రమణమూర్తి గారి ఆద్వర్యంలో స్థానిక నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులుగా నియమించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు గారు ఆదివారం నరసన్నపేట నియోజకవర్గంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ బగ్గు రమణమూర్తి గారి ఆద్వర్యంలో స్థానిక నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం నాయకులు,కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు.ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని సూచించారు. అధికార మదంతో విర్రవీగుతున్న వైసీపి ప్రభుత్వానికి చెంపపెట్టులా,అరాచక పాలనలో భయబ్రాంతులకు గురవుతున్న రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం చాలా అవసరమని సమావేశంలో సత్యానందరావు తెలిపారు.