Headlines

తవణంపల్లిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.

చిత్తూరు జిల్లా

తవణంపల్లిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పూతలపట్టు ఇంచార్జ్ కే. కోదండ ఆధ్వర్యంలో, ముఖ్య అతిథులుగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు లక్ష్మీ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు లక్ష్మి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ .కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని, భవిష్యత్ కార్యాచరణను ముందుకు తీసుకుపోయే విధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని, ఈ సమావేశంలో ఆయన తెలియజేశారు. పార్టీలకతీతంగా ఈ కమిటీ పని చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు దేవి మాట్లాడుతూ 55 పర్సంటేజ్ ఉన్న బీసీలకు ప్రభుత్వం పెద్దపీట వేయాలని ఈ సభాముఖంగా ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం సభ్యులు మరియు రాయలసీమ, జిల్లాల అధికార ప్రతినిధి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.