Headlines

గోనెగండ్ల మండల కేంద్రమైనా గోనెగండ్ల బాషా ఫంక్షన్ హాల్ నందు  నియోజకవర్గ, మండలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల ఆత్మీయ సంమేళన సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త బి వై రామయ్య, ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి బంట్టా రేణుక గారు..

న్యూస్ నైన్ టీవీ పులికొండ

13-03-2024 తేదీన ఎమ్మిగనూరు : గోనెగండ్ల మండల కేంద్రమైనా గోనెగండ్ల బాషా ఫంక్షన్ హాల్ నందు  నియోజకవర్గ, మండలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల ఆత్మీయ సంమేళన సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త బి వై రామయ్య, ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి బంట్టా రేణుక గారు, జిల్లా కార్యదర్శి నాగేష్ నాయుడు గారు, ఈసందర్భంగా శ్రీమతి బుట్టా రేణుక గారు మాట్లాడుతూ జగన్ లాంటి పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ తో పరిపాలన మొత్తం ప్రజల దరి చేరిందన్నారు. అణగారిన వర్గాల ప్రజలు ప్రభుత్వ ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకు ఈ వ్యవస్థను ప్రధానంగా తీసుకొచ్చామని చెప్పారు. జగన్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కనీసం నాలుగైదు పథకాల ప్రయోజనాలు అందాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలను రేపటి ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలని సీఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బుట్టా శివనీలకంఠ గారు, మండల యుత్ ప్రెసిడెంట్, మండల కన్వీనర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*